భావోద్వేగంతో బాబు..రాజధాని శంకుస్థాపన ఫలకానికి సాష్టాంగ నమస్కారం
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ‘చలో అమరావతి’ పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. ఈ పర్యటన కాస్తా టీడీపీ-వైసీపీ కార్యకర్తల బలప్రదర్శనకు వేదికైంది. వైసీపీ కార్యకర్తలు బాబు పర్యటనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఇక ఉద్దండరాయునిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మోకాళ్లపై కూర్చోని రాజధాని నిర్మాణానికి పునాది వేసిన స్థలం వద్ద మోకరిల్లారు. ఈ […]
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ‘చలో అమరావతి’ పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. ఈ పర్యటన కాస్తా టీడీపీ-వైసీపీ కార్యకర్తల బలప్రదర్శనకు వేదికైంది. వైసీపీ కార్యకర్తలు బాబు పర్యటనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఇక ఉద్దండరాయునిపాలెం వద్ద గతంలో రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మోకాళ్లపై కూర్చోని రాజధాని నిర్మాణానికి పునాది వేసిన స్థలం వద్ద మోకరిల్లారు.
ఈ క్రమంలో ప్రజావేదిక కూల్చివేసిన స్థలాన్ని బాబు పరిశీలించారు. ఆ తర్వాత వెంకటాయపాలెం దగ్గరకు చేరుకోగానే పరిస్థితి అదుపు తప్పింది. రైతులు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు జై బాబు, మరికొందరు గో బ్యాక్ బాబు అంటూ స్లో గన్స్ ఇస్తూ బాబు కాన్వాయ్ వైపు దూసుకువచ్చారు. కొందరు రైతులు బాబు దిష్టిబొమ్మను దహనం చేయడంతో పరిస్థితి శృతిమించింది. ఈ క్రమంలో బాబుతో పాటు టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న బస్సు వైపు కొందరు చెప్పులు, రాళ్లు విసిరారు. దీంతో బస్సు ముందు అద్దం ధ్వంసమైంది. దీంతో పోలీసులు కలగజేసుకుని పరిస్థితిని అదుపు చేశారు.