అనంత పర్యటనలో చంద్రబాబు
ఎన్నికల తర్వాత ఢీలాపడ్డ పార్టీలో కొత్త ఉత్సహాన్ని నింపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ్టి నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కంచుకోటగా ఉన్న జిల్లాలో 2019 ఎన్నికల్లో తీవ్ర నిరాశకరమైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే, కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. ఇంతటి నిరాశకరమైన ఫలితాలు రావడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ..వారిలో ఆత్మవిశ్వాసం […]
ఎన్నికల తర్వాత ఢీలాపడ్డ పార్టీలో కొత్త ఉత్సహాన్ని నింపేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ్టి నుంచి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. పార్టీ కంచుకోటగా ఉన్న జిల్లాలో 2019 ఎన్నికల్లో తీవ్ర నిరాశకరమైన ఫలితాలు వచ్చాయి. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు ఉంటే, కేవలం రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. ఇంతటి నిరాశకరమైన ఫలితాలు రావడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ..వారిలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. బాబు పర్యటనను పురస్కరించుకుని పార్టీశ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.