అనారోగ్యంతో కేంద్ర మాజీ మంత్రి.. పరామర్శించిన చంద్రబాబు..!
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. హైదరాబాద్లోని అశోక్ గజపతిరాజు నివాసంలో కలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరాతీశారు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలగడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన్ను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు. హైదరాబాద్లోని అశోక్ గజపతిరాజు నివాసంలో కలిసి ఆయన ఆరోగ్యం గురించి ఆరాతీశారు. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. గత ఎన్డీఏ ప్రభుత్వంలో అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ వైదొలగడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.