ప్రజా హామీలు అమలు చేయాలి : చంద్రబాబు
ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ప్రజలు మన పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలంటూ చంద్రబాబు ట్వీట్.
ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. ప్రజలు మన పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్నారు. లేదంటే చరిత్రహీనుల్లా మిగిలిపోతారంటూ వైసీపీ నేతలకు సూచించారు బాబు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్టర్ ద్వారా స్పందించారు. ఏపీ ప్రజలు నమ్మి వైసీపీకి అధికారం అప్పగించారన్న బాబు.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏడాది పాలనలో రద్దులు, జె-టర్న్ లు తప్ప చేసిందేమీ లేదంటూ ట్వీట్ చేశారు. పాత పథకాలను రద్దుచేసి పథకం అమలు చేస్తున్నరంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ప్రజల జీవితాలను, సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యం. ప్రజల్లో మన పట్ల ఒక నమ్మకం, భరోసా కలిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిలబెట్టుకోవాలి. లేదంటే చరిత్రహీనుల్లా మిగిలిపోతాం. ఇది వైసీపీ పాలకులు గ్రహించాలి(1/4)#ReverseJaganGovt#1YearOfMassDestruction pic.twitter.com/HDGOSTCIuh
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) June 5, 2020