Breaking News
- సిద్దిపేట: దేశానికి ఆదర్శంగా గజ్వేల్ నిలువబోతోంది. గజ్వేల్లో సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి. రూ.కోట్లతో నిర్మించిన కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు-హరీష్రావు.
- ఇంటర్ పరీక్షల నిర్వహణపై కార్యదర్శి జలీల్ ప్రెస్మీట్. అధిక పరీక్ష ఫీజులు వసూలు చేసిన మూడు కాలేజీలు దసరాసెలవుల్లో తరగతులు నిర్వహించిన కాలేజీలకు నోటీసులు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. హాల్ టికెట్లపై ఏ సమస్య ఉన్నా భయపడొద్దు. ఏదైనా సమస్య ఉంటే బోర్డును సంప్రదించాలి. Tsbie.gov.inలో విద్యార్థులు తమ వివరాలు చెక్చేసుకోవచ్చ -ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఉమర్ జలీల్
- రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసనలు. పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా ఆందోళనలు. ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలకు పిలుపు నిచ్చిన టీడీపీ
- తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం శ్రీవారి ఉచిత దర్శనానికి 7 గంటల సమయం. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.73 కోట్లు.
- విశాఖ: రైల్వే ఈ-టికెట్లు బ్లాక్ చేస్తున్న ముఠా గుట్టురట్టు. దువ్వాడ, తాటిచెట్లపాలెంలో ఆర్పీఎఫ్ దాడులు ఈ-టికెట్లు బ్లాక్ చేస్తున్న ఇద్దరు అరెస్ట్. రూ.14.89 లక్షల విలువైన ఈ-టికెట్లు సీజ్. కటక్కు చెందిన సమీర్కుమార్ ప్రధాన్, దుర్గారావు అరెస్ట్. ఐఆర్సీటీసీ వెబ్సైట్ను హ్యాక్ చేస్తున్న నిందితులు ల్యాప్టాప్, డాక్యుమెంట్లు సీజ్చేసిన ఆర్పీఎఫ్
- కర్నూలు: నంద్యాలలో మందుబాబుల వీరంగం. పబ్లిక్గా మద్యం సేవిస్తున్న యువకులు. అడ్డుచెప్పిన మస్తాన్ వలీ అనే వ్యక్తిపై రాళ్లదాడి మస్తాన్వలీకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
- వరంగల్: హన్మకొండలో గుంతలరోడ్డుకు యువతి బలి. హంటర్రోడ్డులో గుంతలో పడి విద్యార్థిని బైక్ బోల్తా. రాంపూర్కు చెందిన విద్యార్థిని బ్లెస్సీ అక్కడికక్కడే మృతి.