తెలుగు వారికోసం చంద్రబాబు లేఖ… ఇంతకీ ఏం జరిగింది?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రం హోంశాఖ కార్యాదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు. తెలుగు వారిని ఆదుకోవాలన్నది లేఖ సారాంశం.
Chandrababu letter to home ministry: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్రం హోంశాఖ కార్యాదర్శి అజయ్ కుమార్ భల్లాకు లేఖ రాశారు. తెలుగు వారిని ఆదుకోవాలన్నది లేఖ సారాంశం. లాక్ డౌన్ పీరియడ్ తెలుగు వారు అత్యధికంగా సఫర్ అవుతున్నందున వారిని ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కేంద్ర హోంశాఖను కోరారు.
టీడీపీ అధినేత చంద్రబాబు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాలకు శుక్రవారం లేఖలు రాశారు. గుజరాత్లో చిక్కుకున్న దాదాపు 4వేల మంది తెలుగువారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన జాలర్లు గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో చిక్కుకున్నారని చంద్రబాబు గుజరాత్ సీఎం, కేంద్ర హోం శాఖ కార్యదర్శి భల్లాల దృష్టికి తీసుకువచ్చారు.
లాక్ డౌన్ సమయం ముగిసేవరకు వారికి గుజరాత్ రాష్ట్రంలో వసతి కల్పించటంతోపాటు అన్నపానీయాలు అందించాలని చంద్రబాబు కోరారు. వారికి వైద్యం సదుపాయం అందించటంతో పాటు అవసరమైన నిత్యవసరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తమ వారి యోగక్షేమాల పట్ల తెలుగు వారి కుటుంబసభ్యులు ఎంతో ఆందోళనతో ఉన్నారని వివరించారు. 4వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న 11మంది ఫోన్ నెంబర్లను తన లేఖలకు జత చేసిన చంద్రబాబు… వాటి ఆధారంగా సహాయ చర్యలు కొనసాగించాలని సూచించారు.