కుయ్‌ కుయ్‌..కుయ్‌.. ఇది మనుషుల కోసం కాదు

మనుషులకు అంబులెన్స్ దొరకడమే కష్టమై ఈ రోజుల్లో పాడై, జబ్బుపడ్డ వృక్షాలకు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు చండీగఢ్ పర్యావణ శాఖ. మనుషులు, జంతువులకే కాదు మొక్కల్లో ఉన్న ప్రాణాలను రక్షించేందుకు వారి ఈ అంబులెన్స్ లు పనిచేస్తున్నాయి. జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. […]

కుయ్‌ కుయ్‌..కుయ్‌.. ఇది మనుషుల కోసం కాదు
Follow us

|

Updated on: Jul 24, 2020 | 6:04 AM

మనుషులకు అంబులెన్స్ దొరకడమే కష్టమై ఈ రోజుల్లో పాడై, జబ్బుపడ్డ వృక్షాలకు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు చండీగఢ్ పర్యావణ శాఖ. మనుషులు, జంతువులకే కాదు మొక్కల్లో ఉన్న ప్రాణాలను రక్షించేందుకు వారి ఈ అంబులెన్స్ లు పనిచేస్తున్నాయి. జబ్బుపడ్డ వృక్షాలకు సరైన చికిత్స అందించడానికి చండీగఢ్ పర్యావణ శాఖ అధికారులు అంబులెన్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు.

క్రిమి కీటకాలతో, చీడ పురుగులతో జబ్బుపడ్డ వృక్షాల కోసం ఈ ఎమర్జెన్సీ సర్వీసు (అంబులెన్స్) వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాంటి చెట్లను ప్రజలు గమనించినట్లయితే వాటి చికిత్స కోసం ఓ ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబరును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటి చికిత్స నిమిత్తం ఓ బృందాన్ని కూడా వెంటనే పంపుతామని దేవేంద్ర దలై  అనే  పర్యావరణ శాఖ అధికారి ఒకరు ప్రకటించారు.