వైసీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వలసలు జోరందుకుంటున్నాయి. తాజాగా సీనియర్ పొలిటీషన్, ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఆయన అన్నారు. లోటస్‌పాండ్‌లో శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేశారు. పార్టీ కండువాతో ఆయనకు జగన్‌ సాదర స్వాగతం​ పలికారు. ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన చల్లా…వైఎస్సార్, ఎన్టీఆర్‌ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశానని […]

వైసీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి
Follow us

|

Updated on: Mar 08, 2019 | 5:19 PM

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వలసలు జోరందుకుంటున్నాయి. తాజాగా సీనియర్ పొలిటీషన్, ఏపీ సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ చల్లా రామకృష్ణారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజన్న రాజ్యం వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని ఆయన అన్నారు. లోటస్‌పాండ్‌లో శుక్రవారం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేశారు. పార్టీ కండువాతో ఆయనకు జగన్‌ సాదర స్వాగతం​ పలికారు.

ఆ తర్వాత ప్రెస్ మీట్‌లో మాట్లాడిన చల్లా…వైఎస్సార్, ఎన్టీఆర్‌ దగ్గర ఎమ్మెల్యేగా పనిచేశానని గుర్తు చేశారు. టీడీపీలో తాను పెద్ద పదవులు అనుభవించలేదని చెప్పారు. సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని బతిమాలితే తీసుకున్నానని వెల్లడించారు. తనకు పెద్ద పదవి ఇస్తానని మూడుసార్లు చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల కోసం పాటు పడతానని.. కల్మషం, కపటం లేకుండా పనిచేస్తానని అన్నారు. కర్నూలులో వైఎస్సార్‌సీపీ విజయానికి కృషి చేస్తానని, చల్లా మాట ఇస్తే తిరుగేలేదని స్పష్టం చేశారు.