Breaking : ఏపీలో పెట్రోల్, డీజిల్పై సెస్ విధింపు
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, హై స్పీడ్ డిజిల్ పై ప్రతి లీటర్ కు ఒక్క రూపాయి చొప్పున సెస్ విధిస్తూ ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాట్ కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపై రూపాయి చొప్పున సెస్ విధిస్తున్నట్లు తెలిపింది. డీలర్ వద్ద నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వం ఆర్డినెన్స్ లో పేర్కొంది. రహదారి అభివృద్ధి నిధి కోసం ఈ సెస్ వసూలు చేస్తున్నట్టు గవర్నమెంట్ స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. సెస్ ద్వారా 600 కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ అదనపు ఆదాయాన్ని రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
Also Read :
విషాదం, నేరెడిమేట్లో మిస్సైన బాలిక మృతదేహం లభ్యం