రేపటి నుంచి దేశీయ విమానాలు.. రాష్ట్రాల అభ్యంతరాలు

దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి మళ్ళీ దేశీయ విమానాలు ఎగరనున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో బాటు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగానూ...

రేపటి నుంచి దేశీయ విమానాలు.. రాష్ట్రాల అభ్యంతరాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 10:49 AM

దేశవ్యాప్తంగా ఈ నెల 25 నుంచి మళ్ళీ దేశీయ విమానాలు ఎగరనున్నాయి. అయితే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంతో బాటు లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్న కారణంగానూ, అసలు ఇందుకు సంసిధ్దంగా లేమని ఆయా ప్రభుత్వాలు సూచనలు ఇవ్వడంతోను.. విమానాల పునరుధ్ధరణపై అయోమయం నెలకొంది.  మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు. కేంద్రం ప్రతిపాదనను సున్నితంగా వ్యతిరేకిస్తున్నాయి. తమ రాష్ట్రంలో  కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయని, లాక్ డౌన్ నిబంధనలను తాము సవరించలేదని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రజారవాణాపై ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయని గుర్తు చేసింది. రెడ్ జోన్ లోని విమానాశ్రయాల్లో విమానాలను పునరుధ్దరించడం ఏమాత్రం సహేతుకం కాదని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటోలు, బస్సులు, క్యాబ్ లను అనుమతించడం సాధ్యం కాదని ఆయన  పేర్కొన్నారు.

తమిళనాడు కూడా దాదాపు ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కోయంబేడు వంటి కరోనా కేసులను ప్రస్తావిస్తూ.. రోజూ అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, అందువల్ల  కేంద్రం తన యోచనను వాయిదా వేసుకోవాలని, లేదా మళ్ళీ పరిశీలించాలని అభ్యర్థించింది. ఇక పశ్చిమ బెంగాల్.. ఇటీవల ఉమ్ ఫున్ తుఫాను తమ రాష్టాన్ని ఎలా కకావికలం చేసిందీ వివరించింది. కోల్ కతా విమానాశ్రయంలో విమానాలు దిగే..లేదా ప్రారంభించే పరిస్థితి లేదని పేర్కొంది. కనీసం ఈ నెల 30 వరకు పౌర విమాన యాన శాఖ తన ప్రతిపాదనను వాయిదా వేసుకోవాలని అభ్యర్థించింది.  ప్రయాణికులు విమానాల నుంచి దిగినప్పటికీ వారిని వారి ఇళ్లకు చేర్చేందుకు ప్రజా రవాణా లేని విషయాన్ని పలు రాష్ట్రాలు పదేపదే ప్రస్తావించాయి. అయితే పౌర విమాన యాన శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి మాత్రం.. ఆయా రాష్ట్రాల విజ్ఞప్తులను తాము పరిగణనలోకి తీసుకున్నామని, కానీ కేంద్రానికీ కొంత బాధ్యత ఉందని వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా.. ఇండిగో, స్పైస్ జెట్, విస్తారా , ఎయిర్ ఏషియా ఇండియా వంటి ఎయిర్ లైన్స్ సోమవారం నుంచి తమ విమానాల పునరుధ్ధరణ నేపథ్యంలో టికెట్ల బుకింగ్స్ ను తీసుకోవడం ప్రారంభించాయి.

రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
రష్మికతో ఇంత క్లోజ్‏గా ఉన్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా ..?
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
వేసవిలో కొబ్బరి నీళ్లు దాహార్తిని తీర్చడంతోపాటు.. ఈ సమస్యలు పరార్
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్
వామ్మో.. ఇంత మార్పా..? ఇప్పుడు బ్యూటీకి కేరాఫ్ అడ్రస్