పోలవరం ప్రాజెక్టు భూసేకరణకు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పోలవరంకు సవరించిన అంచనా వ్యయం రూ. 55,545 కోట్లు. కేంద్ర ఆర్ధిక శాఖ నియమించిన ఆర్ఈసీ
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాస వ్యయాన్ని భరించేందుకు కేంద్రం అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం పోలవరంకు సవరించిన అంచనా వ్యయం రూ. 55,545 కోట్లు. కేంద్ర ఆర్ధిక శాఖ నియమించిన ఆర్ఈసీ రూ. 48 వేల కోట్ల రూపాయల వ్యయానికి ఆమోదం తెలిపింది. పోలవరంపై ఇప్పటికే రూ. 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మిగతా రూ. 32 వేల కోట్లను కేంద్రం భరించనుంది.
రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంకా రూ. 2200 కోట్లు రావాల్సి ఉంది. ఆడిటింగ్ పూర్తి కాగానే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రాజెక్టు ఇంజనీరింగ్ పనులకు ఇంకో రూ. 5వేల కోట్ల ఖర్చు కావచ్చని ఒక అంచనా. భూసేకరణ, పునరావాస పనులకు మిగతా రూ. 27వేల కోట్ల వ్యయం కానుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై మిగిలిన రూ. 7 వేల కోట్ల భారం పడనుంది. జూన్ 2021 లోగా ప్రాజెక్టు ఇంజనీరింగ్ పనులు పూర్తి అవుతాయని జలవనరుల శాఖ అంచనా. దీనికి సమాంతరంగా పునరావాస పనులు చేపట్టేలా ప్రణాళిక రచిస్తోంది. పోలవరం కోసం ప్రత్యేకంగా ఓ అకౌంట్ ఓపెన్ చేయాలని సీఎం జగన్ సూచించారు.