బ్రేకింగ్: ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

ఇటీవల ఏపీ, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను ఖరారు చేసింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు ఆనందీబెన్ పటేల్, త్రిపురకు రమేష్ బయాస్, పశ్చిమ బెంగాల్‌కు జగదీప్ ధన్‌కర్, మధ్యప్రదేశ్‌కు లాల్జీటాండన్, బీహార్‌కు ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఆర్ఎన్ రవిలను కొత్త గవర్నర్లుగా నియమించింది. వీరి నియమాకానికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆనందీ బెన్ పటేల్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేస్తుండగా.. ఇప్పుడు […]

బ్రేకింగ్: ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2019 | 3:11 PM

ఇటీవల ఏపీ, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను ఖరారు చేసింది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు ఆనందీబెన్ పటేల్, త్రిపురకు రమేష్ బయాస్, పశ్చిమ బెంగాల్‌కు జగదీప్ ధన్‌కర్, మధ్యప్రదేశ్‌కు లాల్జీటాండన్, బీహార్‌కు ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఆర్ఎన్ రవిలను కొత్త గవర్నర్లుగా నియమించింది. వీరి నియమాకానికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆనందీ బెన్ పటేల్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేస్తుండగా.. ఇప్పుడు ఆమెను ఉత్తరప్రదేశ్‌ను బదిలీ చేశారు.