దేశంలో 75 జిల్లాలు లాక్ డౌన్..కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ మృత్యునాదం చేస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాలను మర్చి 31 వరకు లాక్ డైన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా డిస్ట్రిక్ కలెక్టర్లుకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో 75 జిల్లాలలో అత్యవసర సేవలు మినహా మిగతా సర్వీసులు పూర్తిగా బంద్ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్లు, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి..ఇతర ముఖ్య అధికారులులో చర్చించిన అనంతరం కేంద్రం […]
దేశంలో కరోనా వైరస్ మృత్యునాదం చేస్తోన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ప్రభావం ఉన్న 75 జిల్లాలను మర్చి 31 వరకు లాక్ డైన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా డిస్ట్రిక్ కలెక్టర్లుకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో 75 జిల్లాలలో అత్యవసర సేవలు మినహా మిగతా సర్వీసులు పూర్తిగా బంద్ కానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్లు, కేంద్ర ప్రభుత్వం కేబినెట్ కార్యదర్శి..ఇతర ముఖ్య అధికారులులో చర్చించిన అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మహమ్మారి కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్ప మరో ఆప్షన్ లేదని అధికారులందరూ ఒకే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చినట్టు సమాచారం. ప్రధాని జనతా కర్ఫ్యూకు ప్రజలు సహకరిస్తోన్న నేపథ్యంలో..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అవ్వనున్న జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాలు…తెలంగాణ నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి.
ఇక తెలంగాణలోనూ కరోనా ఎఫెక్ట్ వల్ల కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలో మార్చి 31 వరకు రాష్ట్రాన్ని షట్ డౌన్ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి ఇప్పటికే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 5 గంటలకు సీఎం ప్రెస్ మీట్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
Govt of India: Lockdown in 75 districts affected by Coronavirus; All trains stopped till Mar31, no metro rail and inter-state buses to operate https://t.co/F9rn123Hpw
— ANI (@ANI) March 22, 2020