ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్…
ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడిన ఏపీ వాసులకు స్థానికత అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఏపీకి వెళ్లాలంటే ఉపాధి కరువు. ఇక్కడే ఉంటే స్థానికత సమస్యతో ఉద్యోగ, ఉపాధికి చిక్కులు.. ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్న ఏపీ వాసులకు కేంద్రం తీపి కబురు అందించింది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారికి 2021 జూన్ 2 వరకూ స్థానికతను […]
ఏపీలో స్థానికత గడువును మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణాలో బతుకుదెరువు కోసం వచ్చి స్థిరపడిన ఏపీ వాసులకు స్థానికత అంశం పెద్ద తలనొప్పిగా మారింది. ఏపీకి వెళ్లాలంటే ఉపాధి కరువు. ఇక్కడే ఉంటే స్థానికత సమస్యతో ఉద్యోగ, ఉపాధికి చిక్కులు.. ఇలా పలు సమస్యలతో సతమతమవుతున్న ఏపీ వాసులకు కేంద్రం తీపి కబురు అందించింది. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారికి 2021 జూన్ 2 వరకూ స్థానికతను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగా.. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోను జారీ చేయనుంది.
తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారికి గతంలో మూడేళ్ల గడువు ఇచ్చారు. ఆపై దాన్ని ఐదేళ్లకు పెంచగా.. ఇప్పుడు మరోమారు ఏడేళ్లకు పెంచుతూ కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఇటీవల ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళినప్పుడు ప్రధాని మోదీతో ఏపీ వాసుల స్థానికత అంశంపై చర్చినట్లు తెలుస్తోంది. గడువును పొడిగించాలని మోదీని కోరారట. ఈ మేరకు తాజాగా స్థానికత గడువును పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.