రెవెన్యూ లోటు కింద ఏపీకి రూ. 491 కోట్లు విడుదల చేసిన కేంద్రం..
రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్వీట్ చేసి వివరాలు వెల్లడించారు.
రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ప్రభుత్వం నిధులు రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ట్వీట్ చేసి వివరాలు వెల్లడించారు. 14 రాష్ట్రాలకు రూ.6,195 కోట్లు రిలీజ్ చేసినట్లు వివరించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు రూ. 491 కోట్లను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. కోవిడ్-19 సంక్షోభ సమయంలో ఈ నిధులు ఉపయోగపడుతాయని నిర్మలమ్మ అభిప్రాయపడ్డారు. 15 ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రాలకు ఏప్రిల్ నుంచి ఈ నిధులు కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
The government on July 8, 2020 released Rs 6,195.08 crore to 14 states as the fourth equated monthly instalment of the Post Devolution Revenue Deficit Grant as recommended by the 15th Finance Commission. This would provide them additional resources during the Corona crisis. pic.twitter.com/f2rO42htJ5
— NSitharamanOffice (@nsitharamanoffc) July 8, 2020