డ్రగ్స్ కేసులో వీళ్ళ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, సారా అలీఖాన్, టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ల మొబైల్ ఫోన్లను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ మొబైల్ ఫోన్లలో..

డ్రగ్స్ కేసులో వీళ్ళ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 10:11 AM

డ్రగ్స్ కేసులో బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, సారా అలీఖాన్, టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ల మొబైల్ ఫోన్లను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ మొబైల్ ఫోన్లలో ‘నిక్షిప్తమై ఉన్న’ డ్రగ్స్ తాలూకు చాటింగ్ గుట్టుమట్లను లాగేందుకు తామీ నిర్ణయం తీసుకున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తెలిపారు. వీరితో బాటు సుశాంత్ మాజీ మేనేజర్ జయా సాహా , ఫ్యాషన్ డిజైనర్ సైమోన్ కంబట్టాల ఫోన్లను కూడా  ఫోరెన్సిక్  విభాగానికి పంపామన్నారు. కాగా-దీపికను శనివారం సుమారు ఆరు గంటలపాటు విచారించినా పెద్దగా ఫలితం లేకపోయింది. వీరిని తాము నిందితులుగా పేర్కొనడంలేదని, కేవలం ఇంటరాగేట్ చేస్తున్నామని ఎన్సీబీ తెలిపింది.