కరోనా కష్టం తాత్కాలికమే.. సినీ కార్మికులకు మూడో విడత సహాయం
కరోనా మహమ్మారి ప్రభావంతో టాలీవుడ్ సినీ కార్మికులంతా తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఈ కరోనా టైంలో షూటింగులు లేవు. అవి మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలీదు. ఇలాంటి సమయంలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కర్మికులకు..
కరోనా మహమ్మారి ప్రభావంతో టాలీవుడ్ సినీ కార్మికులంతా తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ఈ కరోనా టైంలో షూటింగులు లేవు. అవి మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలీదు. ఇలాంటి సమయంలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న సినీ కర్మికులకు సీసీసీ ద్వారా మరోసారి సరుకులను అందజేసినట్లు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇప్పుడు కరోనా పరిస్థితి తాత్కాలికమేనని చెబుతూ సినీ కార్మికుల్లో ధైర్యం నింపారు. ఆయన ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా మూడో విడత నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని 10 వేల మంది సినీ కార్మికులకు మూడో విడత సరుకులు అందజేసినట్లు చిరు వెల్లడించారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన సీసీసీ కమిటీ.. మూడో విడతలో ఇప్పటికే 6 వేల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశామని తెలిపింది. చిత్ర పరిశ్రమ పూర్తిగా కోలుకునేంత వరకు సరుకులు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెగాస్టార్ పేర్కొన్నారు.
కరోనా క్రైసిస్ ఛారిటీ నుంచి మూడో విడత కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వినాయక చవితి పండుగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను – Megastar #Chiranjeevi @KChiruTweets pic.twitter.com/s6szHIlVDG
— BARaju (@baraju_SuperHit) August 21, 2020
Read More:
సోనూ భాయ్ నాకూ సాయం చేయ్.. బ్రహ్మాజీ ట్వీట్
రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలుః సీఎం జగన్