సీబీఎస్ఈ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఎగ్జామ్స్ రాయకుండానే..
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కలవరపెడుతోంది. ఇండియాలో కూడా ఈ డేంజరస్ వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో ఇండియా అంతటా మార్చి 14 వరకు లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని మోదీ. అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాలతో పాటు సీబీఎస్ఈకి సంబంధించి కూడా అకడమిక్ పరీక్షలు ముగియలేదు. దీంతో కేంద్ర నవ వనరుల అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 1 నుంచి 8వ తరగతి వరకు అందరినీ పై […]
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి కలవరపెడుతోంది. ఇండియాలో కూడా ఈ డేంజరస్ వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ క్రమంలో ఇండియా అంతటా మార్చి 14 వరకు లాక్డౌన్ ప్రకటించారు ప్రధాని మోదీ. అయితే ఇప్పటికే చాలా రాష్ట్రాలతో పాటు సీబీఎస్ఈకి సంబంధించి కూడా అకడమిక్ పరీక్షలు ముగియలేదు. దీంతో కేంద్ర నవ వనరుల అభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 1 నుంచి 8వ తరగతి వరకు అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది.
ఇక 9, 10 తరగతుల్లో చదువుతున్న విద్యార్థుల విషయానికి వస్తే, నిర్వహించిన ప్రాజెక్టులు, పీరియాడిక్ పరీక్షలు, టర్మ్ ఎగ్జామ్స్ మొదలైన పాఠశాల ఆధారిత మదింపుల ఆధారంగా వారిని తదుపరి తరగతికు పదోన్నతి పొందుతామని హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ట్వీట్లో పేర్కొన్నారు. ఈసారి ఈ సారి ప్రమోట్ విద్యార్థులు పాఠశాల ఆధారిత పరీక్షలు, ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కనిపించవచ్చని ఆయన అన్నారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హెచ్ఆర్డి మంత్రి స్పష్టం చేశారు.