Breaking: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 30శాతం సిలబస్ కట్ చేసిన CBSE…
కరోనా వైరస్ పుణ్యమా అని విద్యా సంవత్సమే ఆగమైంది. జూన్ నెలలో మొదలు కావల్సిన పాఠాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. కొత్త పుస్తకాలు, కొత్త క్లాసులతో విద్యార్థుల హడావుడితో సందడిగా ఉండే పాఠశాలలు, విద్యాసంస్థలు నిర్జనంగా మారాయి. దీంతో పనిదినాలు క్రమంగా తగ్గుతున్నాయి. విద్యార్థులు ఈ ఏడాది వెనకబడకుండా ఉండేందుకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలోనే 2020-21 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతులకు 30 శాతం సిలబస్ […]
కరోనా వైరస్ పుణ్యమా అని విద్యా సంవత్సమే ఆగమైంది. జూన్ నెలలో మొదలు కావల్సిన పాఠాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. కొత్త పుస్తకాలు, కొత్త క్లాసులతో విద్యార్థుల హడావుడితో సందడిగా ఉండే పాఠశాలలు, విద్యాసంస్థలు నిర్జనంగా మారాయి. దీంతో పనిదినాలు క్రమంగా తగ్గుతున్నాయి.
విద్యార్థులు ఈ ఏడాది వెనకబడకుండా ఉండేందుకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఈ నేపథ్యంలోనే 2020-21 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతులకు 30 శాతం సిలబస్ కట్ చేస్తున్నట్లు CBSE అధికారికంగా తెలిపింది. దీని వల్ల విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గడమే కాకుండా విద్యా సంవత్సరానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదంది. ఇక మార్పులతో కూడిన సిలబస్ను సర్క్యులమ్ కమిటీ ఫైనల్ చేసిందని.. సిలబస్లో లేని పాఠాలు కేవలం విద్యార్థులకు బోధించడమే తప్పితే.. వాటిపై అసైన్మెంట్స్, బోర్డు పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వమని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
#cbseforstudents #students #सीबीएसई ने विद्यार्थियों को बड़ी राहत दी; कक्षा 9वीं – 12वीं का पाठ्यक्रम घटाया गया pic.twitter.com/rg8m9wLfXZ
— CBSE HQ (@cbseindia29) July 7, 2020