ఫెయిలైన స్టూడెంట్స్కు మళ్లీ పరీక్షలు..
మాయదారి కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 9, 11వ తరగతి విద్యార్ధులను గతంలో జరిగిన పరీక్షల ఫలితాలు ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేశాయి. మరి ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి.? ఈ ప్రశ్నకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు సమాధానం ఇచ్చింది. Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం పాఠశాల స్థాయి 9, 11వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు మళ్లీ […]
మాయదారి కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 9, 11వ తరగతి విద్యార్ధులను గతంలో జరిగిన పరీక్షల ఫలితాలు ఆధారంగా పైతరగతులకు ప్రమోట్ చేశాయి. మరి ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి.? ఈ ప్రశ్నకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు సమాధానం ఇచ్చింది.
Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం
పాఠశాల స్థాయి 9, 11వ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్ధులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ వెల్లడించింది. ఏ స్కూల్లో చదువుతున్న విద్యార్ధులకు ఆ స్కూల్ మాత్రమే ఆన్లైన్/ ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించాలని… అంతేకాకుండా విద్యార్ధులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి కొంత సమయం ఇవ్వాలని సీబీఎస్ఈ స్కూళ్లను కోరింది. కాగా, ఈ పరీక్షలలోని ఫలితాలు ఆధారంగా విధ్యార్ధులను పై తరగతులకు ప్రమోట్ చేయవచ్చునని పాఠశాల యాజమాన్యాలకు సీబీఎస్ఈ తెలిపింది.
Read This: నేటి నుంచి వెయిటింగ్ లిస్ట్ బుకింగ్ ప్రారంభం.. రూల్స్ ఇవే..