సింహాల చోరీపై కేసు నమోదు..
దుర్గగుడి రథంలోని సింహాల మాయంపై కేసు నమోదు చేశామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సింహాల చోరీ కేసులో ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు...
దుర్గగుడి రథంలోని సింహాల మాయంపై కేసు నమోదు చేశామని విజయవాడ నగర పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. సింహాల చోరీ కేసులో ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పామని, దేవాలయాలు, ప్రార్ధన మందిరాల వారు వాలంటీర్లను పెట్టుకోవాలని సూచించారు. సీసీఎస్ కూడా దుర్గ గుడి ఘటనపై విచారణ చేస్తారని సీపీ శ్రీనివాసులు తెలిపారు.
రథానికున్న నాలుగో సింహాన్ని తొలగించి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. ఆ సింహం ప్రతిమ బరువు దాదాపు నాలుగు కేజీలు ఉన్నట్లు చెబుతున్నారు. ఎప్పడో పర్వదినాల్లో తప్ప.. మిగతా రోజుల్లో అసలు రథాన్నే బయటకు తియ్యం అనేది ఆలయ నిర్వాహకుల మాట. మొత్తంగా వెండి సింహాల చోరీ పొలిటికల్గా హీట్ పెంచి అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.