‘కే టాక్స్’ దందాలోనూ కోడెల..క్రికెటర్కు కుచ్చుటోపీ
ఇప్పటి వరకు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడిపై, కుమార్తెపై అవినీతి అభియోగాలు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీరిద్దరూ ‘ కే టాక్స్’ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసులు నమోదయ్యాయి. వీటిపై కోడెల ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అధికార పార్టీ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా కోడెలపైనే నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని […]
ఇప్పటి వరకు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడిపై, కుమార్తెపై అవినీతి అభియోగాలు వచ్చాయి. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని వీరిద్దరూ ‘ కే టాక్స్’ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసులు నమోదయ్యాయి. వీటిపై కోడెల ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. అధికార పార్టీ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు నమోదవుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా కోడెలపైనే నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేశారంటూ క్రికెట్ క్రీడాకారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు శివరామ్లపై పోలీసులు కేసు నమోదు చేశాారు.
వివరాల్లోకి వెళ్తే..శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బి.నాగరాజు క్రికెట్లో ఆంధ్ర రంజీ జట్టుకు ఆడాడు. ఆయనకు గతంలో భరత్చంద్ర అనే వ్యక్తితో పరిచయం ఉంది. అతను రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కోడెల శివరామ్ వద్దకు నాగరాజును తీసుకెళ్లాడు. ఒప్పందం ప్రకారం 2017 డిసెంబర్ 31న ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో రూ.15 లక్షలు శివరామ్కు నాగరాజు చెల్లించాడు. నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరాడు. శివరామ్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆయన తండ్రి శివప్రసాదరావును ఫోన్లో సంప్రదించానని, ఆయన నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదని నాగరాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామని సీఐ ఆళహరి తెలిపారు.