AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Degree Admissions 2025: విద్యార్ధులకు అలర్ట్.. రేపట్నుంచే డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..!

డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. రేపట్నుంచే (ఆగస్ట్‌ 20) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున..

Degree Admissions 2025: విద్యార్ధులకు అలర్ట్.. రేపట్నుంచే డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..!
Degree Online Admissions
Srilakshmi C
|

Updated on: Aug 19, 2025 | 3:14 PM

Share

అమరావతి, ఆగస్ట్‌ 19: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. రేపట్నుంచే (ఆగస్ట్‌ 20) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ మేరకు ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజున వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తన ప్రటకనలో తెలిపింది. రిజిస్ట్రేషన్లకు ఐదారు రోజులు సమయం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.

తెలంగాణ CPGETలోనూ ఆన్సర్ కీపై ‘అభ్యంతర’ ఫీజు వసూలు.. మరో రెండు రోజులే ఛాన్స్‌!

తెలంగాణలో ఉమ్మడి పరీక్షలకు సంబంధించి గత ఏడాది ఓ కొత్త రూల్‌ అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. నియమాక పరీక్షలుతోపాటు ఇతర ప్రవేశ పరీక్షలకు ప్రాధమిక ఆన్సర్‌కీపై అభ్యంతరాలు లేవనెత్తేందుకు నిర్ధిష్ట రుసుము చెల్లించాలనే కొత్త నిబంధన తీసుకువచ్చింది. దీంతో టీజీపీఎస్సీ నియామక పరీక్షలతోపాటు రాష్ట్రంలో నిర్వహించే అన్ని ఉమ్మడి పరీక్షలకు ఆన్సర్‌ కీలపై అభ్యంతరాలు లేవనెత్తాలంటే ఒక్కో ప్రశ్నకు నిర్ధిష్ట రుసుము చెల్లించాలని పేర్కొంది. ఈ విధానం ద్వారా అనవసరంగా సమయం వృద్ధా అవ్వడం అరికట్టవచ్చని, సకాలంలో నియామకాలు పూర్తి చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలకు ఈ విధానం అమలు చేస్తూ వచ్చింది.

తాజాగా ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష(టీజీ సీపీగెట్) ప్రాథమిక కీపై కూడా అభ్యర్థులు అభ్యంతరం తెలిపేందుకు తొలిసారిగా ఫీజు చెల్లించాలని పేర్కొంటూ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది జరిగిన ఈఏపీసెట్‌, ఐసెట్ వంటి పలు ప్రవేశ పరీక్షలకు అభ్యంతరాలపై ఫీజు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇదే మాదిరి సీపీగెట్‌లోనూ ఒక్కో ప్రశ్నపై అభ్యంతరానికి ఫీజు రూ.200 చొప్పున చెల్లించాలని నిర్ణయించారు. ఒకవేళ అభ్యర్ధులు తెలిపే అభ్యంతరాలు సరైనవని తేలితే వాటిని పరిగణనలోకి తీసుకుని, ఫీజును తిరిగి చెల్లిస్తామని సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్‌ ఐ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆగస్ట్ 21వ తేదీ ఉదయం 11 గంటల వరకు అభ్యంతరాలను ఆన్‌లైన్‌ విధానంలో పంపొచ్చని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..