వదినమ్మా.. వార్నర్‌ను ఫైనల్‌కి రమ్మనవా!

సోమవారం పంజాబ్ తో ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించి.. ప్లే ఆఫ్ అశలను సజీవం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ (81; 56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ తో అభిమానులను అలరించి.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. వార్నర్‌ మెరుపుల కారణంగా జట్టు ప్లేఆఫ్‌ చేరే […]

వదినమ్మా.. వార్నర్‌ను ఫైనల్‌కి రమ్మనవా!
Follow us

|

Updated on: Apr 30, 2019 | 5:42 PM

సోమవారం పంజాబ్ తో ఉప్పల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించి.. ప్లే ఆఫ్ అశలను సజీవం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో మరోసారి స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ (81; 56 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ తో అభిమానులను అలరించి.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు. వార్నర్‌ మెరుపుల కారణంగా జట్టు ప్లేఆఫ్‌ చేరే అవకాశం ఉండటంతో అభిమానులు అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ క్రమంలో వార్నర్‌ మెరుపు ఇన్నింగ్స్‌ గురించి…‘ అద్భుత ఇన్నింగ్స్‌తో ఐపీఎల్‌ సీజన్‌కు ముగింపు పలికావు. నిన్ను చూసి నేను, పిల్లలు ఎల్లప్పుడూ గర్వంగా ఫీలవుతాం. ఇతరులకు ఆదర్శంగా ఉండే యాటిట్యూడ్‌ను నువ్వెప్పుడూ విడిచిపెట్టలేదు. వి లవ్‌ యూ’ అం‍టూ ఆరెంజ్‌ ఆర్మీ హ్యాష్‌ట్యాగ్‌ను జతచేస్తూ అతడి భార్య కాండిస్‌ వార్నర్ చేసిన ట్వీట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ ట్వీట్ కు అభిమానులు కామెంట్స్ పెడుతూ.. ‘మేము కూడా వార్నర్‌ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. వదినమ్మా. అతడు కూడా ఇప్పుడు హైదరాబాదీనే. మిమ్మల్ని మిస్సవుతాము. వీలైతే మనం తలపడే ఫైనల్‌ మ్యాచ్‌కు వార్నర్‌ను రమ్మని చెప్పు..’ అంటూ వార్నర్‌పై అభిమానం చాటుకోవడంతో పాటు సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు చేరుతుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.