వరదల ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు
పశ్చిమ, దక్షిణ భారతంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో.. దీని ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లన్నీ ధ్వంసమవ్వగా.. నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్ల మీద కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇవాళ నడపాల్సిన 14 రైళ్లను పశ్చిమ రైల్వే రద్దుచేసింది. పలు ప్రాంతాల్లో వరదలు, నీటి ప్రవాహల కారణంగా రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమరైల్వే ప్రకటిచింది. ఈ నెల 14న 13 రైళ్లు, […]
పశ్చిమ, దక్షిణ భారతంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో.. దీని ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. భారీ వర్షాలకు పలు చోట్ల రోడ్లన్నీ ధ్వంసమవ్వగా.. నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చోట్ల రైల్వే ట్రాక్ల మీద కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇవాళ నడపాల్సిన 14 రైళ్లను పశ్చిమ రైల్వే రద్దుచేసింది. పలు ప్రాంతాల్లో వరదలు, నీటి ప్రవాహల కారణంగా రైళ్లను రద్దు చేసినట్లు పశ్చిమరైల్వే ప్రకటిచింది. ఈ నెల 14న 13 రైళ్లు, 15న 8 రైళ్లు, 16న 5 రైళ్లు, 17, 18 తేదీల్లో 3 రైళ్లు, 19న ఒక రైలు సర్వీసును రద్దు చేసినట్లు తెలిపింది. ఇవాళ కింద్రాబాద్-రాజ్కోట్, పోర్బందర్-సికింద్రాబాద్, 14న రాజ్కోట్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-పోర్బందర్, 15న రాజ్కోట్-సికింద్రాబాద్, 17న ఇండోర్-లింగంపల్లి, 18న లింగంపల్లి-ఇండోర్ సర్వీస్ రద్దైన వాటిలో ఉన్నాయి.