CAA Protests: షాహీన్బాగ్ దాటి.. జఫ్రాబాద్ మెట్రోకి.. సీఏఏ ప్రొటెస్టర్ల వెన్యూ షిఫ్ట్
సీఏఏకి నిరసనగా ఢిల్లీ లోని షాహీన్ బాగ్ లో నెలరోజులకు పైగా ధర్నా చేస్తున్న ఆందోళనకారులు.. శనివారం రాత్రి అక్కడి నుంచి ఈశాన్య ఢిల్లీ లోని జఫ్రాబాద్ మెట్రోకి తమ వెన్యూను షిఫ్ట్ చేశారు. చేతిలో జాతీయ పతాకాలను చేతబట్టుకుని.
CAA Protests: సీఏఏకి నిరసనగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ లో నెలరోజులకు పైగా ధర్నా చేస్తున్న ఆందోళనకారులు.. శనివారం రాత్రి అక్కడి నుంచి ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రోకి తమ వెన్యూను షిఫ్ట్ చేశారు. చేతిలో జాతీయ పతాకాలను చేతబట్టుకుని.. ‘ఆజాదీ’ (స్వాతంత్య్రం) కావాలని నినాదాలు చేస్తూ తమ నిరసనను ఉధృతం చేశారు. అనేకమంది మహిళలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరి నిరసన కారణంగా ఆదివారం ఉదయం మెట్రో స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డుపై ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు.. పోలీసులు నిరసనకారులతో చర్చలు ప్రారంభించారు. వారు రోడ్డును బ్లాక్ చేయడం సరికాదని సీనియర్ పోలీసు అధికారి వేద్ ప్రకాష్ సూర్య అంటున్నారు. ఎందుకైనా మంచిదని పారా మిలిటరీ బలగాలను కూడా రప్పించినట్టు ఆయన తెలిపారు. ఇలా ఉండగా.. ప్రభుత్వ ఉద్యోగాలకు, ప్రమోషన్లకు కోటాలు, రిజర్వేషన్లు కల్పించడం ప్రాథమిక హక్కు కాదని ఇటీవల సుప్రీంకోర్టు ఇఛ్చిన తీర్పునకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె చేయాలంటూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఇఛ్చిన పిలుపును ఈ ఆందోళనకారులంతా సమర్థిస్తున్నారు.