Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా..!
Silver Price Today: నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇక తాజాగా సోమవారం స్వల్పంగా పెరిగింది. అయితే భారతీయ సాంప్రదాయంలో..
Silver Price Today: నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉంటే.. వెండి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఇక తాజాగా సోమవారం స్వల్పంగా పెరిగింది. అయితే భారతీయ సాంప్రదాయంలో బంగారం, వెండికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే తాజాగా సోమవారం సిల్వర్ ధర దిగివచ్చింది. వెండి ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక తాజాగా దేశీయంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,100 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.67,100 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, కోల్కతాలో రూ.67,100 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,100 ఉండగా, కేరళలో రూ.72,000 ఉంది. ఇక అహ్మదాబాద్లో కిలో వెండి రూ.67,100 ఉండగా, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.72,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.72,000 ఉండగా, విశాఖపట్నంలో రూ.72,000 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.
అయితే బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.