EPFO: ఫీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. అది కనుక జరిగితే ఆ డబ్బులు రెట్టింపు..!
EPFO: ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పనుంది. పీఎఫ్ పెన్షన్ డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..
EPFO: ప్రావిడెంట్ ఫండ్ (Provident Fund) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పనుంది. పీఎఫ్ పెన్షన్ డబ్బులను రెట్టింపు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే పీఎఫ్ చందాదారులకు మంచి ప్రయోజనం చేకూరనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఇప్పుడు సబ్స్క్రైర్లకు నెలకు రూ.1000 పెన్షన్ అందిస్తోంది. ఈ మొత్తం చాలా తక్కువ. అందుకే ఈ డబ్బులను పెంచాలని పార్లమెంట్ కమిటీ చెబుతోంది. పార్లమెంట్ స్టండింగ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక అందించింది. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2022-23ను పార్లమెంట్కు సమర్పించింది. ఇందులో పీఎఫ్ పెన్షన్ (PF Pension) పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపింది. అయితే గత ఎనిమిది సంవత్సరాల నుంచి పీఎఫ్ పెన్షన్ను రూ.1000గా నిర్ణయించారని, ఈ మొత్తాన్ని పెంచాలని పార్లమెంట్ స్టండింగ్ కమిటీ పేర్కొంది.
ఇప్పుడు ఇది చాలా తక్కువ అని అంటోంది. ఇది ఇలా ఉంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ఇందుకు ఇంకా అంగీకరించలేదు. కనీస పెన్షన్ను రూ.1000గానే కొనసాగించింది. అలానే పీఎఫ్ సబ్స్క్రైబర్లు మరీ ముఖ్యంగా 2015 కన్నా ముందు పదవీ విరమణ చేసిన వారు ఇనామినేషన్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నివేదిక చెబుతోంది. పీఎఫ్ చందాదారులకు అందించే పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కార్మిక మంత్రిత్వశాఖకు సూచించింది. ఈ విషయంలో నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి: