Stock Market: భారీగా పెరుగుతున్న ఆ స్టాక్.. లక్ష రూపాయలు పెడితే రెండు వారల్లో రూ.3,46,026 రాబడి..
మార్కెట్లో లిస్ట్ అయిన వారంలోనే ఆ కంపెనీ స్టాక్ విలువ భారీగా పెరిగింది. ఈ స్టాక్ ఐపీఓలో లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.3,46,026కు చేరింది...
మార్కెట్లో లిస్ట్ అయిన వారంలోనే ఆ కంపెనీ స్టాక్ విలువ భారీగా పెరిగింది. ఈ స్టాక్ ఐపీఓలో లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ రూ.3,46,026కు చేరింది. మల్టీ రిటర్స్న్ ఇస్తున్న షేరు పరాస్ డిఫెన్స్. అక్టోబర్ 1 న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పరాస్ డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీస్ షేర్లు, ప్రతి ట్రేడింగ్ సెషన్లో అప్పర్ సర్క్యూట్లో లాక్ అవుతున్నాయి. సునీల్ సింఘానియా, ముకుల్ అగర్వాల్తో సహా పెట్టుబడిదారులకు మూడు రెట్ల రాబడిని ఇచ్చింది ఈ స్టాక్. పరాస్ డిఫెన్స్ ఒక్కో పబ్లిక్ ఆఫర్ షేరు ధర రూ .175 నుంచి అక్టోబర్ 7 నాటికి రూ. 606.10 కి చేరుకుంది. అంటే ఐపీఓ ధర నుండి 246.3 శాతం పెరిగింది. అక్టోబర్ 1న 285 శాతం పెరిగి రూ. 498.75 వద్ద చేరుకుంది. 2011 తర్వాత ఒక కంపెనీకి లిస్టింగ్ లాభం ఇదే అతిపెద్దది.
రక్షణ, అంతరిక్ష ఉత్పత్తులు తయారు చేసే ప్రతిరోజు అప్పర్ సర్క్యూట్ను తాకుతున్నాయి. అబాక్కస్ అసెట్ మేనేజ్మెంట్ వ్యవస్థాపకుడు సునీల్ సింఘానియాకు పరాస్ డిఫెన్స్ కంపెనీలో వాటా ఉంది. ముకుల్ మహావీర్ ప్రసాద్ అగర్వాల్కు కూడా షేర్లు ఉన్నాయి. పరాస్ డిఫెన్స్లో అబాక్కస్ 314,286 షేర్లను కలిగి ఉంది. అగర్వాల్కు 904,286 షేర్లు ఉన్నాయి. సెప్టెంబర్ 20న యాంకర్ బుక్ ద్వారా అబక్కస్ అదనంగా 665,805 షేర్లను కొనుగోలు చేశారు.
Read Also.. Amazon offer On One Plus: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ. 3 వేల తగ్గింపులో వన్ప్లస్ స్మార్ట్ఫోన్లు..!(వీడియో)