రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర
పసిడి పరుగు ఆగడం లేదు. తాజాగా బంగారం ధర ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.35,970వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం నాటి కొనుగోళ్లలో బంగారం ధరలో రూ.100పెరుగుదల నమోదైంది. 10గ్రాముల బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఎప్పుడూ లేదని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. స్థానిక జ్యువెలర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో పాటు, ఈక్విటీ మార్కెట్లలో పతనం కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణమని వారు […]
పసిడి పరుగు ఆగడం లేదు. తాజాగా బంగారం ధర ఎన్నడూలేనంత గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల బంగారం ధర రూ.35,970వద్ద ట్రేడ్ అవుతోంది. సోమవారం నాటి కొనుగోళ్లలో బంగారం ధరలో రూ.100పెరుగుదల నమోదైంది. 10గ్రాముల బంగారం ధర ఈ స్థాయికి చేరడం ఎప్పుడూ లేదని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. స్థానిక జ్యువెలర్ల నుంచి విపరీతమైన డిమాండ్ ఉండటంతో పాటు, ఈక్విటీ మార్కెట్లలో పతనం కూడా బంగారం ధర పెరగడానికి ఒక కారణమని వారు అంచనా వేస్తున్నారు.
మరోవైపు వెండి కిలో. 41,960గా ఉంది. గతవారంతో పోలిస్తే వెండి ధరలో రూ.260పెంపు నమోదైంది. పరిశ్రమలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపుతుండటంతో వెండి ధర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.