గుట్టల్లో గుట్టుగా మృతదేహం కాల్చివేత.. ఎవరిది.?
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో హైదరాబాద్ రింగురోడ్డు సమీపంలో ఓ మృతదేహాన్ని కాల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది.
తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సమయంలో హైదరాబాద్ రింగురోడ్డు సమీపంలో ఓ మృతదేహాన్ని కాల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం రాత్రి రింగురోడ్డు సమీపంలోని కోహెడ్ రెవిన్యూ పరిధి దగ్గర ఉన్న గుట్టలలో నుంచి రెండు అంబులెన్సులు రావడాన్ని స్థానికలు గుర్తించారు. వాటిని అడ్డగించి.. అందులో ఉన్నవారిని ప్రశ్నించగా.. అసలు విషయం బయటపడింది. దీనితో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ వారి నుంచి వివరాలు సేకరించగా.. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే మృతదేహాన్ని కాల్చివేసినట్లు స్పష్టమైంది.
కాగా, ఈ విషయం తుర్కయాంజాల్ పురపాలిక ఛైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ, స్థానిక నాయకులకు తెలియడంతో గురువారం ఉదయం అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎక్కడి నుంచో తెచ్చిన మృతదేహాలను ఇక్కడ కాల్చడం ఏంటని.. కరోనా సోకి మరణించినవారివైతే ఇక్కడ జనం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఇవి చదవండి:
మిస్టరీ డెత్స్: కరోనా వేళ.. 50 కాకులు, మూడు కుక్కలు మృతి..
భారత్ క్రికెటర్లు సెంచరీలు కోసం.. పాకిస్తాన్ ప్లేయర్స్ దేశం కోసం ఆడతారు..
గాంధీ ఆసుపత్రి కంటే జైలు బెటర్.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.
రంజాన్ కోసం.. ఏపీలో సడలింపులు ఇవే.!
ముస్లిం ఇచ్చాడని వద్దన్నాడు.. జైలు పాలయ్యాడు..