‘తన చావు వార్త’పై యువ నటుడి వ్యంగ్య స్పందన
నటుడు, బుల్బుల్ ఫేమ్ అవినాష్ తివారీ మరణించినట్లు ఇటీవల కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన ఈ నటుడు ఆ వార్తలను ఖండించారు.
బుల్బుల్ ఫేమ్, నటుడు అవినాష్ తివారీ మరణించినట్లు ఇటీవల కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన ఈ నటుడు ఆ వార్తలను ఖండించారు. ”అంత త్వరగా వెళ్లనులెండి. ఇలా వార్తలను పుట్టించే వారు ఎక్కడి నుంచో వస్తారో తెలీదు. కొంచెం స్టాండర్డ్ని పెంచుకోండి. థ్యాంక్యు” అని కామెంట్ పెట్టారు. ఈ మేరకు తాను చనిపోయాడంటూ రాసిన ఓ ఆర్టికల్ను ఆయన షేర్ చేశారు. అయితే ఆ తరువాత ఆ న్యూస్ని వెబ్సెట్ తొలగించింది.
కాగా తూ హే మేరా సండే మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. లైలా మజ్ను, గోస్ట్ స్టోరీస్, బుల్బుల్ చిత్రాల్లో నటించి గుర్తింపును తెచ్చుకున్నారు. పరిణితీ చోప్రా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ద గర్ల్ ఆన్ ద ట్రైన్ చిత్రంలోనూ అవినాష్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Not so soon guys :) Kaun hain ye log…Kahan se aate hain ye log? Bhai thoda standard improve kar lo apna…Plzz. Thank you ?? https://t.co/WfPhmH2OxR
— Avinash Tiwary (@avinashtiw85) July 18, 2020