ఘోరం: ఇంటిమిద్దె కూలి ఐదుగురు దుర్మరణం
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి గోపాల్పేట మండలం బుద్ధారంలో అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మృతి చెందాడు. ఆయన భార్య మణెమ్మ గ్రామంలో నివసిస్తుండగా, ఆమె కుమారులు హైదరాబాద్లో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కోసం తమ కుటుంబాలతో గ్రామానికి వచ్చారు. శనివారం ఆ కార్యక్రమం ముగియగా రాత్రి భోజనాల అనంతరం 9 మంది ఓ గదిలో పడుకున్నారు. గది […]
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి గోపాల్పేట మండలం బుద్ధారంలో అయిదుగురు దుర్మరణం పాలయ్యారు. గ్రామానికి చెందిన చెవ్వ నర్సింహ ఏడాది క్రితం మృతి చెందాడు. ఆయన భార్య మణెమ్మ గ్రామంలో నివసిస్తుండగా, ఆమె కుమారులు హైదరాబాద్లో ఉంటున్నారు. తండ్రి సంవత్సరీకం కోసం తమ కుటుంబాలతో గ్రామానికి వచ్చారు. శనివారం ఆ కార్యక్రమం ముగియగా రాత్రి భోజనాల అనంతరం 9 మంది ఓ గదిలో పడుకున్నారు. గది పైకప్పు అర్ధరాత్రి కూలడంతో అందులో పడుకున్న మణెమ్మతోపాటు ఆమె ఇద్దరు కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, అక్షయ అక్కడిక్కడే మృతి చెందారు. మూడో కుమారుడు కుమారస్వామి తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కుమారస్వామిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పాడుబడిన ఇల్లు కావడంతోనే కూలిందని అధికారులు తెలిపారు.