Budget 2021: ఈసారి బడ్జెట్‌లో రవాణ వ్యవస్థకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి. రైల్వే వాటా ఎంత..? ప్రైవేట్ రైల్ కూత ఎప్పుడు..?

వచ్చే బడ్జెట్‌లో ఈసారి 10శాతం అధికంగా కేటాంపులు జరపాలని భారత రైల్వే శాఖ కొత్త ప్రతిపాదనలు అందినట్లు సమాచారం.

Budget 2021: ఈసారి బడ్జెట్‌లో రవాణ వ్యవస్థకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి. రైల్వే వాటా ఎంత..? ప్రైవేట్ రైల్ కూత ఎప్పుడు..?
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2021 | 7:12 PM

Budget 2021: సమాజంలో ప్రాంతీయ అసమానతలను తగ్గించి, రక్షణ సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం భారత ప్రభుత్వం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపులకు జరుపుతోంది. ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి మంచి ప్రణాళికతో కూడిన బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా వచ్చే బడ్జెట్‌లో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయనే దానినిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత ఖజనాలో కీలకపాత్ర పోషించే రైల్వేలకు ఎలాంటి కేటాయింపు ఉంటాయన్నదానిపై చర్చ మొదలైంది.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సదుపాయాల కల్పనతో పాటు అధునీకరణకు ఈసారి 10శాతం అధికంగా కేటాంపులు జరపాలని కేంద్రం ముందుకు భారత రైల్వే శాఖ కొత్త ప్రతిపాదనలు అందినట్లు సమాచారం. వచ్చే బడ్జెట్ నుండి సుమారు 75,000 కోట్ల రూపాయల స్థూల బడ్జెట్ మద్దతు (జీబీఎస్‌)ను రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్ చేసిన జీబీఎస్‌ గత ఏడాది బడ్జెట్‌లో అందుకున్న జీబీఎస్‌ కంటే 7% ఎక్కువ. గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ రైల్వే కోసం రూ. 70,250 కోట్ల జీబీఎస్‌ను కేటాయించారు. అదే సమయంలో, రైల్వేలకు 2019-20లో రూ. 69,967 కోట్లు, 2018-19లో రూ. 55,088 కోట్లు జీబీఎస్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది మూలధన వ్యయాన్ని 13% పెంచాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖతో తన కార్యకలాపాలను వేగవంతం చేయడానికి కొత్తగా ప్రతిపాదించింది రైల్వే శాఖ. ఇందులో భాగంగా రైల్వే వ్యవస్థను ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్నందున దాని కేటాయింపులో 10% పెరుగుదల కోరుతోంది. రైల్వే తన కాపెక్స్ బడ్జెట్‌ను ఈ ఏడాది రూ .1.6 లక్షల కోట్ల నుంచి రూ .1.8 లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఇది వ్యాపారపరంగా చూస్తూ మామూలు వృద్ధి కంటే 10% ఎక్కువ.

ప్రభుత్వరంగంలో అతిపెద్ద డిపార్ట్‌మెంటల్ ఎంటర్‌ప్రైజెస్ అయిన రైల్వే శాఖ.. గత కొన్ని సంవత్సరాలుగా సృజనాత్మక సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంపై గణనీయమైన దృష్టి కేంద్రీకరించింది. అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుందని రైల్వే శాఖ వాదిస్తోంది. మరోవైపు కరోనా పుణ్యామాన్ని లాక్‌డౌన్ కాలంలో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయినప్పటికీ, ఈ సంవత్సరం కాపెక్స్ బడ్జెట్‌లో సుమారు 1.55 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది.

లాక్‌డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ప్రయాణీకుల రైళ్లు కూత పెట్టలేదు. గూడ్స్ చేరవేతకు సంబంధించి కొన్ని రైళ్లను మాత్రమే అధికారులు పట్టాలెక్కించారు. ఈ సమయంలో ట్రాక్‌లు, ఇతర పనులను పునరుద్ధరించడంపై రైల్వే అధికారులు దృష్టి పెట్టారు. కొన్ని సందర్భాల్లో కొంతమంది కార్మికులతో మానవశక్తిని ద్వారా మరమత్తు పనులను పూర్తి చేయాల్సి వచ్చింది. అదేవిధంగా, ఎక్స్‌ప్రెస్‌వేలతో సహా పెద్ద ప్రాజెక్టులు చేపటాల్సి ఉన్నందున నిధుల కేటాయింపును సుమారు 10% పెంచాలని రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.

గత ఏడాది ప్రభుత్వం దాదాపు 92,000 కోట్ల రూపాయలను మంత్రిత్వ శాఖకు కేటాయించింది. పెట్రోల్, డీజిల్‌పై సెస్ ద్వారా ఎక్కువ నిధులు వస్తున్నాయి. నిధుల వినియోగం కోసం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నష్టపోకుండా చూసేందుకు ప్రభుత్వం లెవీని పెంచింది.

బిజినెస్ టుడే నివేదిక ప్రకారం, రైల్వే మంత్రిత్వ శాఖ 2021-22 సంవత్సరానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి మొత్తం రూ .1.80 లక్షల కోట్లు డిమాండ్ చేస్తోంది. ఇందులో జిబిఎస్ 75,000 కోట్ల రూపాయలు కాగా, రైల్వే సమర్పించిన మొత్తం మూలధన వ్యయం మునుపటి సంవత్సరం బడ్జెట్ అంచనా కంటే 12.5 శాతం ఎక్కువ. కనీసం 1.70 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రభుత్వం ఆమోదిస్తుందని భావిస్తోంది. ఇది గత బడ్జెట్‌తో పోలిస్తే 6 శాతం అధికంగా ఉంటుందని రైల్వే మంత్రిత్వ శాఖ భావిస్తోంది.

రైల్వే బడ్జెట్‌లో దృష్టి సారించే విషయాలలో ప్రైవేట్ రైళ్లు, కొత్త రైళ్ల ద్వారా కొత్త మార్గాల్లో వేగంగా ప్రయాణించడం, పర్యాటక ప్రదేశాలకు మెరుగైన కనెక్టివిటీ, సోలార్ ప్యానెల్ ఆధారిత గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇది కాకుండా, కిసాన్ రైల్ సర్వీస్ విస్తరణ, ఈశాన్య రాష్ట్రాల్లో రైలు కనెక్టివిటీపై కూడా దృష్టి పెట్టవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కొత్త లైన్లు, రెట్టింపు ప్రాజెక్టుల కోసం మంత్రిత్వ శాఖ రూ. 35,965 కోట్లు ప్రతిపాదించింది. ఈ సమయంలో రైళ్లు నడపకపోవడంతో లాక్‌డౌన్ రైల్వేకు వేగంగా పనిచేయడానికి అవకాశం ఇచ్చిందని అధికారులు తెలిపారు.

ఇది చదవండి… Budget 2021: కేంద్ర బడ్జెట్‌ను తెలుసుకునేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌.. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే..

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!