పార్లమెంటులో బడ్జెట్ ను ప్రతిపాదించనున్న కేంద్రం, ఎన్నో సవాళ్లు, పరిష్కారానికి నిధుల వెల్లువతో ప్రయత్నాలు

2021-22 సంవత్సరానికి గాను కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీనికి ముందు ప్రధాని మోదీ ఈ నెల 30 న జరిగే అఖిల పక్ష సమావేశానికి..

పార్లమెంటులో బడ్జెట్ ను ప్రతిపాదించనున్న కేంద్రం, ఎన్నో సవాళ్లు, పరిష్కారానికి నిధుల వెల్లువతో ప్రయత్నాలు
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jan 22, 2021 | 4:42 PM

2021-22 సంవత్సరానికి గాను కేంద్రం ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. దీనికి ముందు ప్రధాని మోదీ ఈ నెల 30 న జరిగే అఖిల పక్ష సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం వర్చ్యువల్ గా జరుగుతుందని, అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ఆహ్వానం పంపామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. ఫిబ్రవరి 1 న ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. దేశం ఇప్పుడిప్పుడే కోవిడ్ 19 బారి నుంచి కోలుకుంటున్న వేళ ఆర్థిక పునరుజ్జీవనానికి ఆమె పలు చర్యలు, ప్రతిపాదనలు ప్రకటించవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితుల నుంచి ఉద్యోగావకాశాల కల్పన, హెల్త్ కేర్, గృహ నిర్మాణ రంగం..ఇలా పలు రంగాలపై ఆమె దృష్టి పెట్టవచ్చు.

ఇన్ కమ్ టాక్స్ డిడక్షన్స్

కోవిడ్ 19 కారణంగా దేశంలో లక్షలాది మంది తమ ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయారు. వేతనాలలో కోత కూడా తప్పలేదు. దీంతో ఆర్ధిక మంత్రి ఆత్మనిర్భర్ పథకం కింద పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచవచ్చు ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి వర్గాలు తమ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని కోరుతున్నాయి. ఇక… .అలాగే హయ్యర్ స్టాండర్డ్ డిడక్షన్ (ఆదాయపు  పన్నుతో సంబంధం లేని వేతనం) ను ప్రస్తుతమున్న 50 వేల నుంచి 75 వేలు లేదా లక్ష రూపాయలవరకు పెంచే సూచనలు ఉన్నాయి. అధిక ఆదాయం పొందుతున్నవారిపై కోవిడ్ సెస్ విధించే యోచన కూడా ఉంది. మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించే విధంగా  హౌసింగ్ రంగంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అంటున్నారు. ఇళ్ళు కొనుగోలు చేయాలనుకునేవారికి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ నిబంధనలను సర్కార్ సరళీకృతం చేస్తుందని భావిస్తున్నారు. కొత్త బడ్జెట్ లో క్రెడిట్ తో కూడిన సబ్సిడీని ఇవ్వవచ్చు.

డెవలప్ మెంట్ ఫైనాన్స్ ఇన్స్ టి ట్యుషన్ ని ప్రతిపాదిస్తారని కూడా భావిస్తున్నారు. ఈ  నూతన సంస్థ 100 లక్షల కోట్ల విలువైన ఇన్ ఫ్రా స్ట్రక్చర్ (కొత్తవి లేదా ప్రస్తుతమున్నవి) ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుంది. హెల్త్ కేర్ కు సంబంధించి సెక్షన్ 80 డీ కింద మెడి క్లెయిమ్ ప్రీమియం ను 50 వేలవరకు పెంచుతారని ఆశిస్తున్నారు.

ఇంకా ఆర్ధిక లోటును భర్తీ చేసుకునేందుకు కేంద్ర ఆర్ధికమంత్రి పలు ప్రతిపాదనలు చేసే అవకాశాలు ఉన్నాయి.

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్