హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య..
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 2:57 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అనుమానాస్పద స్థితిలో బీటెక్‌ విద్యార్థిని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చందానగర్‌ రాజీవ్‌ స్వగృహలో నివాసం ఉండే ఏడుకొండలు, శమంతకమణిల కుమార్తె అంబిక (21) బీటెక్‌ (కంప్యూటర్స్‌) చదువుతూ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో రాజీవ్‌ స్వగృహ అపార్ట్‌మెంట్‌ పై నుంచి దూకింది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

కాగా.. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.

Also Read: కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ముగ్గురి మృతి ..