కర్ణాటక సీఎంగా నాలుగోసారి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం
బెంగళూరు: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్భవన్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ వాజుభాయి వాలా యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనకు గవర్నర్ అభినందనలు తెలిపారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప ఒక్కరే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ఎవ్వరూ ప్రమాణస్వీకారం చేయలేదు. యడియూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ కర్ణాటక […]
బెంగళూరు: కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్భవన్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ వాజుభాయి వాలా యడియూరప్పతో సీఎంగా ప్రమాణం చేయించారు. అనంతరం ఆయనకు గవర్నర్ అభినందనలు తెలిపారు.
రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో యడియూరప్ప ఒక్కరే సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులుగా ఎవ్వరూ ప్రమాణస్వీకారం చేయలేదు. యడియూరప్ప ప్రమాణస్వీకారోత్సవానికి మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ కర్ణాటక ఇన్చార్జి మురళీధర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. యడియూరప్ప ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ – జేడీఎస్ పార్టీల నేతలు గైర్హాజరయ్యారు. కర్ణాటక సీఎంగాయడియూరప్ప ప్రమాణస్వీకారం చేయడం ఇది నాలుగో సారి. 2007లో మొదటిసారి, 2008లో రెండోసారి, 2018లో మూడోసారి, ఇప్పుడు నాలుగోసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే, గతంలో మూడుసార్లు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు.