Breaking News: గుంటూరులో దారుణం.. మత్తు మందు ఇచ్చి .. అశ్లీల వీడియోలు..

గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు...

Breaking News: గుంటూరులో దారుణం.. మత్తు మందు ఇచ్చి .. అశ్లీల వీడియోలు..
Follow us

|

Updated on: Jun 28, 2020 | 1:06 AM

Brutal Assault in Guntur : గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. ఇంజినీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతికి మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియోలు చిత్రీకరించి ఈ దారుణానికి ఒడిగట్టారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో ఆ వీడియోలను పెడతామంటూ బెదిరింపులకు దిగారు. చేసేదిలేక బాధితురాలు.. కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ‘దిశ’ పోలీసులు ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను అరెస్టు చేశారు.

ఈ దారుణ ఘటనపై విచారణ జరుపుతున్నామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మూడేళ్ల క్రితం కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి యువతి నగ్న చిత్రాలు తీశారని… వాటిని నెట్‌లో పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. మొదట యువతి చిత్రాలు నెట్‌లో పెట్టి తాత్కాలికంగా డిలీట్‌ చేశారని అన్నారు.

ఆ యువతి మరొకరితో సన్నిహితంగా ఉందని దృశ్యాలు మరో యువకుడికి చూపారని చెప్పారు. యువతికి మెయిల్స్ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారని… నిందితులు కౌశిక్‌, వరుణ్‌లు బాధితురాలి వీడియోలను పోర్న్‌ సైట్‌లో కూడా పెట్టారన్నారు. ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు.