ఎలుగు చెప్పింది, జో బైడెన్ గెలుస్తారని, ‘జోస్యం’ ఫలిస్తుందా ?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 3 న జరగనున్నాయి, ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ ట్రంప్ గెలుస్తారా లేక డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఎవరు విజయం సాధిస్తారన్నది మనుషులకన్నా జంతువులే చక్కగా ఊహిస్తాయని రష్యన్ల నమ్మకం. ఉదాహరణకు సైబీరియా జూలోని ఊదారంగు ఎలుగుబంటి.. ఈ ఎలెక్షన్స్ లో బైడెనే విజయం సాధిస్తారని ‘జోస్యం’ చెప్పింది. రెండు పులులు కూడా ఆయనవైపే మొగ్గు చూపాయి. ఇవి ఎలా ‘చెబుతాయంటే’… […]

ఎలుగు చెప్పింది, జో బైడెన్ గెలుస్తారని, 'జోస్యం' ఫలిస్తుందా ?
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 01, 2020 | 1:50 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 3 న జరగనున్నాయి, ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ ట్రంప్ గెలుస్తారా లేక డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెనా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. అయితే ఎవరు విజయం సాధిస్తారన్నది మనుషులకన్నా జంతువులే చక్కగా ఊహిస్తాయని రష్యన్ల నమ్మకం. ఉదాహరణకు సైబీరియా జూలోని ఊదారంగు ఎలుగుబంటి.. ఈ ఎలెక్షన్స్ లో బైడెనే విజయం సాధిస్తారని ‘జోస్యం’ చెప్పింది. రెండు పులులు కూడా ఆయనవైపే మొగ్గు చూపాయి. ఇవి ఎలా ‘చెబుతాయంటే’… రెండు పుచ్ఛకాయలను వీటి ఎదురుగా పెట్టినప్పుడు ఏ ముక్కవైపు ఈ జంతువులు వఛ్చి వాటిని కింద పడవేస్తాయో ఆ పేరున్న అభ్యర్థి గెలుస్తాడట !  ఆశ్చర్యంగా ఈ మూడు జంతువులూ జో బైడెన్ విజయం సాధిస్తారన్నట్టు ఆ ముక్కనే పడగొట్టాయి. ట్రంప్ అని రాసి ఉన్న ముక్కను ఇవి ముట్టుకోలేదు.

2018 లో బయాన్ అనే పోలార్ ఎలుగు వరల్డ్ కప్ విజేత ఎవరన్నది చెప్పలేకపోయింది. 2019 లో జరిగిన ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల్లో జెలెన్ స్కీ విజయాన్ని అది ఊహించలేకపోయింది. అయితే అవోరా అనే ఎలుగుబంటి మాత్రం ఆయనదే విజయమని చక్కగా ఎంపిక చేసింది. ఇదే ఎలుగు ఈసారి జో బైడెన్ గెలుస్తారని చెబుతోంది.