‘ ఈ దేశ కూతుళ్ళకు న్యాయం జరుగుతుంది ‘… నిర్భయ తల్లి
నిర్భయ కేసులో ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలి తల్లి..ఢిల్లీ కోర్టు తీర్పు పట్ల హర్షం ప్రకటించారు. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలన్న కోర్టు నిర్ణయం తనకెంతో సంతృప్తిని కలిగించిందని, ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకు గల విశ్వాసాన్ని పునరుధ్ధరింపజేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘ ఇక నా కూతురికి న్యాయం జరుగుతుంది.. అలాగే ఈ దేశంలోని కూతుళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ‘ అని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. (నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ […]
నిర్భయ కేసులో ఏడేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలి తల్లి..ఢిల్లీ కోర్టు తీర్పు పట్ల హర్షం ప్రకటించారు. ఈ కేసులో నలుగురు దోషులను ఉరి తీయాలన్న కోర్టు నిర్ణయం తనకెంతో సంతృప్తిని కలిగించిందని, ఇది న్యాయవ్యవస్థపై ప్రజలకు గల విశ్వాసాన్ని పునరుధ్ధరింపజేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ‘ ఇక నా కూతురికి న్యాయం జరుగుతుంది.. అలాగే ఈ దేశంలోని కూతుళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది ‘ అని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. (నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22 వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తీర్పును ప్రకటించింది). కోర్టు నిర్ణయంతో నేరస్థులు భయపడతారని ఆమె అన్నారు.
కాగా-తాము దోషుల తరఫున క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని వారి తరఫు న్యాయవాది ఏపీ సింగ్ వెల్లడించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ పిటిషన్ వేస్తామని ఆయన చెప్పారు. ఈ కేసులో మీడియా, ప్రజలు, రాజకీయ నేతల ఒత్తిడి మొదటినుంచీ ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. పక్షపాత రహితంగా కేసు విచారణ సాగలేదని పేర్కొన్న ఆయన.. ఈ అంశాల ఆధారంగానే క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.