తమిళనాడుతో జూలై 31 వరకు లాక్డౌన్
తమిళనాడులో కూడా మరో విడత లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్డౌన్ గడువు జూన్ 30 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ జూలై 31 వరకు పొడిగించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగుతూనే ఉంది. కరోనా కట్టడిలో భాగాంగా మరోసారి లాక్డౌన్ వైపే మొగ్గుచూపుతున్నాయి అయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే మహారాష్ట్ర సహా మరికొన్ని రాష్ట్రాలు జూలై 31 వరకు లాక్డౌన్ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా తమిళనాడులో కూడా మరో విడత లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్డౌన్ గడువు జూన్ 30 తో ముగియనుంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ జూలై 31 వరకు పొడిగించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలకు సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మధురై, గ్రేటర్ చెన్నై పోలీస్ లిమిట్స్లో మాత్రం జూలై 5 వరకు కంప్లీట్ లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపింది. గ్రేటర్ చెన్నై పరిధిలోని చెన్నై, కాంచిపురం, చెంగల్పట్టు, తిరువళ్లువార్ ప్రాంతాల్లో మాత్రం జూలై 5 వరకు పూర్తిస్థాయిలో లాక్డౌన్ అమలులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.