మరో ‘ప్రణయ్-అమృత’ ఉదంతం – పరువుహత్యకు పాల్పడ్డ తండ్రి

హైదరాబాద్ చందానగర్ లో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై యువతి తండ్రి దాష్టికానికి పాల్పడినట్టు తెలుస్తోంది. చందానగర్ లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఆదే ప్రాంతానికి చెందిన యువతి తో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో కొత్త జంట నివాసం ఉంటున్నారు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి గుండాలతో యువకుడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో దారుణంగా హత్య చేయించాడని సమచారం. […]

మరో 'ప్రణయ్-అమృత' ఉదంతం - పరువుహత్యకు పాల్పడ్డ తండ్రి
Follow us

|

Updated on: Sep 25, 2020 | 10:16 AM

హైదరాబాద్ చందానగర్ లో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ జంటపై యువతి తండ్రి దాష్టికానికి పాల్పడినట్టు తెలుస్తోంది. చందానగర్ లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు ఆదే ప్రాంతానికి చెందిన యువతి తో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం అనంతరం గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో కొత్త జంట నివాసం ఉంటున్నారు. ప్రేమ వివాహాన్ని ఇష్టపడని యువతి తండ్రి కిరాయి గుండాలతో యువకుడిని కిడ్నాప్ చేసి సంగారెడ్డిలో దారుణంగా హత్య చేయించాడని సమచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు,చందానగర్లో మిసింగ్ కేసు, సంగారెడ్డిలో హత్య కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ పరువు హత్య కేసులో పోలీస్‌ల అలసత్వం కనిపిస్తుందని భావిస్తున్నారు.

అవంతి, హేమంత్ లను నిన్న గచ్చిబౌలిలో కిడ్నాప్ చేసింది అవంతి తండ్రి పంపిన సుపారి గ్యాంగ్. ఈ క్రమంలో కారులో నుంచి అవంతి దూకి పారిపోయి 100 కి సమాచారం ఇచ్చింది. అయితే, సకాలంలో పోలీసులు స్పందించలేదని.. గచ్చీబౌలి పోలీసులు ఆలస్యం చేయడంతో హేమంత్ ని సంగారెడ్డి తీసుకుని వెళ్లి సుపారి గ్యాంగ్ హత్యచేసిందని బాధితకుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇలాఉండగా, రాత్రికి తేరుకొని విచారణ జరిపి అవంతి తండ్రి ఇచ్చిన సమాచారంతో సంగారెడ్డిలో హేమంత్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో హేమంత్ మృతదేహం ఉంది.