కొలంబో వరుస పేలుళ్లపై సినీ ప్రముఖుల ఆగ్రహం
వరుస పేలుళ్లతో ఆదివారం ఉదయం శ్రీలంక ఉలిక్కిపడింది. రాజధాని కొలంబోలో జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 166 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. * ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుంటే.. దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు మనల్ని మింగేస్తాయి. ద్వేషం పేరుతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నవారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన అసవరం మన పౌరులకు ఉంది- ప్రకాశ్ రాజ్ * […]
వరుస పేలుళ్లతో ఆదివారం ఉదయం శ్రీలంక ఉలిక్కిపడింది. రాజధాని కొలంబోలో జరిగిన ఈ దాడుల్లో ఇప్పటివరకు 166 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
* ప్రజలు ప్రార్థనలు చేసుకుంటుంటే.. దాడులకు పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు మనల్ని మింగేస్తాయి. ద్వేషం పేరుతో సమాజాన్ని విడదీయాలని చూస్తున్నవారిపై ఓ కన్నేసి ఉంచాల్సిన అసవరం మన పౌరులకు ఉంది- ప్రకాశ్ రాజ్
* శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగాయని తెలిసి చాలా బాధపడ్డాను. లంక ప్రజల క్షేమాన్ని కోరుకుంటున్నాను- విశాల్
* ఓ మై గాడ్. కొలంబోలోని సిన్నమన్ హోటల్ నుంచి నేను బయటికి వచ్చిన కొద్దిసేపటికే పేలుడు సంభవించింది. నేను నమ్మలేకపోతున్నాను- రాధికా శరత్కుమార్
* ఈస్టర్ పర్వదినాన జరిగిన ఈ దాడిని చూసి గుండెపగిలిపోయింది- సుధీర్బాబు
* ఇది జరిగి ఉండకూడదు. బాధితుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారు ఎంత బాధపడుతున్నారో ఊహించడానికి కూడా భయంగా ఉంది. దేవుడా..కాపాడు- నివేదా థామస్
* ఈస్టర్ సండే ట్రాజెడీగా మారిపోయింది. రాక్షసులకు దయ అనేదే ఉండదు. బలహీన సమయాల్లోనే కుటుంబాలపై, పిల్లలపై దాడులు చేస్తుంటారు- సిద్ధార్థ్
* షాకింగ్.. బాధాకరం- సౌందర్య రజనీకాంత్
* శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరగడం నిజంగా బాధాకరం. హింస అనేది ఓ చెయిన్ రియాక్షన్లా మారిపోయిందని ఎవ్వరూ గుర్తించకపోవడం దురదృష్టకరం. దీనికి ముగింపు పలకాలి- జాక్వెలీన్ ఫెర్నాండెజ్ (బాలీవుడ్ నటి)