అక్షయ్ కోటి రూపాయల విరాళం
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ మధ్య రీల్ హీరో కన్నా రియల్ హీరోగానే ఎక్కువగా వార్తలలో వినిపిస్తూ ఉన్నాడు. రీసెంట్గా పుల్వామా ఉగ్ర దాడి బాధితుల కుటుంబాలకు తన వంతు సాయాన్ని అందించాడు. ఉగ్రదాడిలో మరణించిన వీరజవాన్లకి 5 కోట్ల విరాళాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ పెళ్లి చేసుకుంటున్న ఒక్కో యువతికి లక్షల రూపాయలు అందజేశారు. ఆ మొత్తం వారి వ్యక్తిగత ఖాతాలకి నేరుగా […]
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ మధ్య రీల్ హీరో కన్నా రియల్ హీరోగానే ఎక్కువగా వార్తలలో వినిపిస్తూ ఉన్నాడు. రీసెంట్గా పుల్వామా ఉగ్ర దాడి బాధితుల కుటుంబాలకు తన వంతు సాయాన్ని అందించాడు. ఉగ్రదాడిలో మరణించిన వీరజవాన్లకి 5 కోట్ల విరాళాన్ని అందించి గొప్ప మనసును చాటుకున్నాడు. తాజాగా సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ కుమార్ పెళ్లి చేసుకుంటున్న ఒక్కో యువతికి లక్షల రూపాయలు అందజేశారు. ఆ మొత్తం వారి వ్యక్తిగత ఖాతాలకి నేరుగా బదిలి చేశారట. కొత్త జీవితాన్ని పూర్తి హక్కుతో ప్రారంభించండని వారిని అక్షయ్ ఆశీర్వదించారు.వంద మంది జంటలు ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్షయ్ సాయాన్ని మరవలేమంటూ ఆ యువతులు భావోద్వేగానికి లోనయ్యారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ వివాహా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం కేసరి అనే చిత్రంతో బిజీగా ఉన్న అక్షయ్ కుమార్ ఈ చిత్రాన్ని మార్చి 21న విడుదల చేయనున్నాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించడం ఖాయం అని విశ్లేషకులు చెబుతున్నారు.