బాక్సింగ్.. రాజకీయాలు.. నా రెండు కళ్లు

గెలిచినా.. ఓడినా.. రాజకీయాల్లో కొనసాగుతానని ఒలింపిక్ కాంస్య విజేత, దక్షిణ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజేందర్ సింగ్ స్పష్టం చేశారు. బాక్సింగ్, రాజకీయాలను తాను సమాంతరంగా కొనసాగిస్తానని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదైందని చెప్పారు. రాజకీయాలు, క్రీడలు రెండు వేరు వేరని.. కానీ రెండింటిలో బాగా శ్రమించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని.. ధనవంతులకే బీజేపీలో స్థానం ఉంటుందని […]

బాక్సింగ్.. రాజకీయాలు.. నా రెండు కళ్లు
Follow us

| Edited By:

Updated on: May 10, 2019 | 4:52 PM

గెలిచినా.. ఓడినా.. రాజకీయాల్లో కొనసాగుతానని ఒలింపిక్ కాంస్య విజేత, దక్షిణ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి విజేందర్ సింగ్ స్పష్టం చేశారు. బాక్సింగ్, రాజకీయాలను తాను సమాంతరంగా కొనసాగిస్తానని ఆయన అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోకపోవడమే మంచిదైందని చెప్పారు.

రాజకీయాలు, క్రీడలు రెండు వేరు వేరని.. కానీ రెండింటిలో బాగా శ్రమించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పేదల పార్టీ అని.. ధనవంతులకే బీజేపీలో స్థానం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఓ మామూలు డ్రైవర్ కుమారుడినని.. దక్షిణ ఢిల్లీ అభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తానని ఈ సందర్భంగా విజేందర్ సింగ్ హామీ ఇచ్చారు.