జగన్‌పై బొండా ఉమా ఫైర్

విజయవాడ: తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న డేటా వార్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా స్పందించారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కై టీడీపీ కార్యకర్తల డేటాను దొంగిలించారని ఆయన ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఫిర్యాదులు చేసిన వైసీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని బొండా ఉమా జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లోని టీడీపీ పార్టీ కోసం పని చేస్తోన్న ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడి చేసిన సంగతి […]

జగన్‌పై బొండా ఉమా ఫైర్
Follow us

|

Updated on: Mar 04, 2019 | 7:55 PM

విజయవాడ: తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న డేటా వార్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా స్పందించారు. జగన్, కేసీఆర్ కుమ్మక్కై టీడీపీ కార్యకర్తల డేటాను దొంగిలించారని ఆయన ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఫిర్యాదులు చేసిన వైసీపీ నేతలు జైలుకు వెళ్లక తప్పదని బొండా ఉమా జోస్యం చెప్పారు.

హైదరాబాద్‌లోని టీడీపీ పార్టీ కోసం పని చేస్తోన్న ఐటీ గ్రిడ్ కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రజల డేటాను ఇక్కడ అక్రమంగా టీడీపీ పార్టీ కోసం వినియోగిస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులకు లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వైసీపీ ఐటీ వింగ్ నాయకుడు రాంరెడ్డి అనే వ్యక్తి కూడా ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఐటీ గ్రిడ్ కంపెనీపై ఫిర్యాదు చేశారు.