మొదటి భార్యకే పరిహారం.. బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు
బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పరిహారం వ్యవహారంలో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. భర్త మరణానంతరం వచ్చే పరిహారం మొదటి భార్యకే చెందుతుందని తీర్పునిచ్చింది. ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలుంటే, అతడి మరణానంతరం...
Bombay High Court ruled : బొంబాయి హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పరిహారం వ్యవహారంలో కోర్టు ఈ తీర్పును ఇచ్చింది. భర్త మరణానంతరం వచ్చే పరిహారం మొదటి భార్యకే చెందుతుందని తీర్పునిచ్చింది. ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలుంటే, అతడి మరణానంతరం వచ్చే పరిహారం మొదటి భార్యకే చెందుతుందని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది.
మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగం చేసే సురేష్ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు.. అయితే కరోనాతో మే 30న ఆయన చనిపోయారు. సురేష్ చనిపోయిన తర్వాత అతడికి రూ.65లక్షల పరిహారం వచ్చింది. ఈ డబ్బులు ఎవరికి చెందాలో కోర్టు క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనలో పరిహారం కోసం ఇద్దరు భార్యలూ దరఖాస్తు చేసుకున్నారు. అదే సమయంలో 2వ భార్య కోర్టుకెళ్లింది. అయితే మొదటి భార్య, రెండవ భార్యల పిల్లలకే పరిహారంలో వాటా వస్తుందని హైకోర్టు తీర్పిచ్చింది.