మాల్యా పిటిషన్ కొట్టివేసిన బాంబే హైకోర్టు
ముంబై: తన ఆస్తుల జప్తును నిలిపివేయాలని విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటీషన్ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. గురువారం జస్టిస్ అఖిల్ ఖురేషి, జస్టిస్ ఎస్జే కథవాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆస్తుల జప్తుపై స్టే ఇవ్వాలని మాల్యా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అంతేగాక తనపై వేసిన ‘పారిపోయిన ఆర్థిక నేరగాడి’ ముద్రకు సంబంధించి చెల్లుబాటును సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే వరకు […]
ముంబై: తన ఆస్తుల జప్తును నిలిపివేయాలని విజయ్ మాల్యా దాఖలు చేసిన పిటీషన్ను బాంబే హైకోర్టు కొట్టివేసింది. గురువారం జస్టిస్ అఖిల్ ఖురేషి, జస్టిస్ ఎస్జే కథవాలాతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేస్తున్న ఆస్తుల జప్తుపై స్టే ఇవ్వాలని మాల్యా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
అంతేగాక తనపై వేసిన ‘పారిపోయిన ఆర్థిక నేరగాడి’ ముద్రకు సంబంధించి చెల్లుబాటును సవాల్ చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చే వరకు రక్షణ కల్పించాలని ఇదే పిటిషన్లో కోరారు. దీన్ని కోర్టు కొట్టివేసింది. బ్యాంకులకు రూ.9,000 కోట్లు అప్పు ఎగవేత కేసులో విజయ్ మాల్యా నిందితుడిగా ఉన్నారు. 2019 జనవరిలో ముంబయిలోని ప్రత్యేక పీఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఆక్ట్) కోర్టు మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.