ఈఫెల్ టవర్ కు బాంబు బెదిరింపు, టెర్రరిస్టుల పనేనా ?
పారిస్ లోని ఎత్తయిన ఈఫెల్ టవర్ ని బాంబులతో పేల్చివేస్తామంటూ ఆగంతకుడొకరు ఫోన్ లో హెచ్ఛరించడంతో బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ టవర్ ను మూసివేశారు. అక్కడున్న జనాలను..
పారిస్ లోని ఎత్తయిన ఈఫెల్ టవర్ ని బాంబులతో పేల్చివేస్తామంటూ ఆగంతకుడొకరు ఫోన్ లో హెచ్ఛరించడంతో బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ టవర్ ను మూసివేశారు. అక్కడున్న జనాలను వెంటనే నిష్క్రమించవలసిందిగా పోలీసులు కోరారు. ఆ ప్రాంతాన్ని వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఈ టవర్ ని పేల్చివేయడమే గాక అక్కడే తాను ఆత్మాహుతికి పాల్పడతానని కూడా హెచ్ఛరించాడట. మరొక కథనం ప్రకారం.. తను టవర్ వద్ద బాంబులు పెట్టానని, ఏ క్షణంలో అయినా అవి పేలిపోతాయని ఈ వ్యక్తి చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే పోలీసులు దీన్ని ధృవీకరించలేదు. పోలీసులతో బాటు బాంబు స్క్వాడ్ బృందాలు కూడా ఆ ప్రాంతంలో క్షుణ్ణంగా గాలించాయి. ఇటీవలి కాలంలో అల్ ఖైదా, ఐసిస్ ఉగ్రవాదులు ఇలా బాంబు బెదిరింపులకు దిగారు. ఈ టవర్ ని తాము లక్ష్యంగా చేసుకున్నామని, దీన్ని పేల్చివేస్తామని వారు చాలాసార్లు హెచ్చరించారట.
Les abords de la Tour Eiffel sont bouclés par la police. Il y a une alerte à la bombe. La circulation est déviée Quai Branly. – @BFMParis pic.twitter.com/WZnWytKk0f
— Barthelemy Bolo (@B2Bolo) September 23, 2020