నెల్లూరు జిల్లాలో బాంబు పేలుడు కలకలం
నెల్లూరు జిల్లా ఉదయగిరి పరిధిలోని నివాస ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం రేపింది. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేప్టటారు. అయితే అది నాటు బాంబు కావడంతో అందరూ ఊపిరి పీల్చకున్నారు. వీధి కుక్క నోటితో కొరకడంతో బాంబు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదు. బాంబు పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఘటనాస్థలంలో దొరికిన […]
నెల్లూరు జిల్లా ఉదయగిరి పరిధిలోని నివాస ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం రేపింది. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేప్టటారు. అయితే అది నాటు బాంబు కావడంతో అందరూ ఊపిరి పీల్చకున్నారు. వీధి కుక్క నోటితో కొరకడంతో బాంబు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం చోటు చేసుకోలేదు. బాంబు పేలుడు శబ్దానికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఘటనాస్థలంలో దొరికిన ఆధారాలను బట్టి అది లోకల్గా తయారుచేసే బాంబుగా గుర్తించారు. పొలాల్లోకి వచ్చి నష్టం చేస్తున్న అడవి పందులను తరిమికొట్టేందుకు అలాంటి బాంబులను స్థానికంగా తయారుచేస్తుంటారని తెలుస్తోంది.
Andhra Pradesh: A crude bomb exploded in a residential area of Udayagiri in Nellore district earlier today after a dog accidentally chewed it, killing it on the spot. Police say, the bomb was built by a local to scare away wild pigs. pic.twitter.com/wcbb6lcCPz
— ANI (@ANI) May 8, 2019